సుశాంత్ చనిపోగానే రియా వేశ్యగా మారిందా? ప్రియాంక సంచలన ఆరోపణలు

by Disha Web Desk 10 |
సుశాంత్ చనిపోగానే రియా వేశ్యగా మారిందా? ప్రియాంక సంచలన ఆరోపణలు
X

దిశ, సినిమా : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆయన సోదరి ప్రియాంక సింగ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఘాటు వ్యాఖ్యలు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఉద్దేశించినవే అనే చర్చనడుస్తోంది. విషయానికొస్తే.. ఇటీవల ఓ సమావేశంలో రియా మాట్లాడుతూ ‘పోయిన వారు ఎలాగో తిరిగిరారు. నేను ఇప్పుడు ఎవరి కోసం భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారు’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన ప్రియాంక.. ‘మీరు ఎందుకు భయపడతారు? మీరు వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న రాజకీయ నాయకులను చూసుకునే నీకు అంత ధైర్యం’ అంటూ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా మరోసారి సుశాంత్‌ను తలచుకుంటూ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రేమ జంటలపై సామాజిక ఒత్తిడి.. ఇండియాలో ఎక్కువేనంటున్న స్వర

ఆ యాప్స్ లో నా ఫొటోలు వాడొద్దు.. బోల్డ్ బ్యూటీ వార్నింగ్



Next Story

Most Viewed