షాకింగ్ ట్విస్ట్.. మళ్లీ ఒక్కటి కానున్న చైతూ-సామ్!

by Disha Web Desk 6 |
షాకింగ్ ట్విస్ట్.. మళ్లీ ఒక్కటి కానున్న చైతూ-సామ్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, తమిళం అన్న తేడా లేకుండా అనేక సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు. తాజాగా, తమిళ స్టార్ హీరో శింబుతో కలిసి 'ముత్తు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 17న విడుదల కానుంది. దీంతో గౌతమ్ మీనన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను తెలిపారు. ''ఓటీటీ వచ్చాక చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఏదో పెద్ద సినిమాలను ఓటీటీ ద్వారానే చూస్తున్నారు.

నిజం చెప్పాలంటే మూవీకి భాషతో సంబంధం లేదు. 'ముత్తు'లో కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినప్పటికీ భావం తెలుస్తుంది. నేను శింబుతో కలిసి 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్‌తో ఉన్న ఈ సినిమాను కథ డిమాండ్ చేయడంతో రెండు పార్టులుగా విడుదల చేస్తున్నాము. కమల్‌హాసన్‌గారితో 'రాఘవన్‌ 2', అలాగే వెంకటేష్‌గారితో 'ఘర్షణ 2' నాగచైతన్యతో కలిసి 'ఏ మాయ చేసావే2' సినిమాలను చేయాలని అనుకుంటున్నాను''. అని డైరెక్టర్ గౌతమ్ మీనన్ అన్నారు. దీంతో అభిమానులు సమంత-నాగచైతన్య మళ్లీ కలిసిపోతారా? లేదా అన్న ఆందోళనలో ఉన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

సమంత రెండో పెళ్లి.. ఆ వ్యక్తి ఎవరంటే?

చిరిగిన గుడ్డలతో డ్రెస్ కుట్టించుకున్న నటి.. అందాలన్నీ ఆరుబయటే


Next Story

Most Viewed