‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్‌.. ఈసారి అంతకు మించి ఫన్..

by I. Sairam |   (  Updated:2026-01-18 13:43:52  IST  )

ప్రజెంట్ హిట్ డైరెక్టర్స్‌ లిస్టులో ముందు వరసలో ఉన్నాడు అనిల్ రావిపూడి.

‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్‌.. ఈసారి అంతకు మించి ఫన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ హిట్ డైరెక్టర్స్‌ లిస్టులో ముందు వరసలో ఉన్నాడు అనిల్ రావిపూడి. అతను ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీరోల్ ప్లే చేశాడు. అయితే గత ఏడాది వెంకీ మామతో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అనిల్ రావిపూడి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ వెంకీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డుకెక్కింది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. వివరాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టును వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు సిద్ధమవుతున్నారని తెలిసింది.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్నారు వెంకటేశ్‌. ఈ సినిమా ఏప్రిల్‌లోగా పూర్తవుతుందని తెలిసింది. దీని తర్వాత వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌లో జాయిన్‌ అవుతారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

2027 సంక్రాంతికి వ‌చ్చే 5 సినిమాలు ఇవే !

‘నువ్వు తోపు కాదు తోపులకు బాపువి’: డైరెక్టర్‌పై నిర్మాత ప్రశంసలు

Next Story