సినిమా ఆపేయాలని బెదిరింపులు.. పోలీస్ ప్రొటెక్షన్ కోరిన డైరెక్టర్

by Disha Web Desk 10 |
సినిమా ఆపేయాలని బెదిరింపులు.. పోలీస్ ప్రొటెక్షన్ కోరిన డైరెక్టర్
X

దిశ, సినిమా : 'గాంధీ గాడ్సే-ఏక్ యుద్ధ్' డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషి తనకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరుతూ ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాడు. 'మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జనవరి 20న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. ఈ క్రమంలో దూసుకొచ్చిన కొందరు వ్యక్తులు సినిమా ప్రమోషన్స్, విడుదల ఆపాలని హెచ్చరించారు. ఆ తర్వాత పలు బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ సంఘటనలన్నీ అసురక్షితంగా కనిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తులను విడిచిపెట్టడం వలన నాతో పాటు నా కుటుంబ సభ్యులకు నష్టం కలుగుతుంది. ఈ విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుని మమ్మల్ని రక్షించేందుకు అదనపు భద్రతను అత్యవసరంగా అందించాలని అభ్యర్థిస్తున్నా' అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : 'Pathan'కు రూ.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్.. 100 దేశాల్లో విడుదల


Next Story

Most Viewed