'Pathan'కు రూ.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్.. 100 దేశాల్లో విడుదల

by Disha Web Desk 10 |
Pathanకు రూ.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్.. 100 దేశాల్లో విడుదల
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'పఠాన్' రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లో రిలీజ్ కానున్న సినిమాకు ఇప్పటికే రూ. 50 కోట్ల విలువైన అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. అంతేకాదు ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ రూ. 23 కోట్లకు చేరడం విశేషం. దీంతో ఓపెనింగ్ కలెక్షన్స్ రూ. 50కోట్లకుపైగా ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న విశ్లేషకులు.. ఐదు రోజుల్లో రూ. 500 కోట్ల వసూళ్లను రాబట్టగలదని అంచనా వేస్తున్నారు. ఇక జనవరి 25న సినిమా విడుదల సందర్భంగా అభిమానులు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్‌తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం. కాగా 'పఠాన్'లో దీపికా పదుకొణే, జాన్ అబ్రహాం కీలక పాత్రల్లో కనిపించనుండగా.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు.

ఇవి కూడా చదవండి : సినిమా ఆపేయాలని బెదిరింపులు.. పోలీస్ ప్రొటెక్షన్ కోరిన డైరెక్టర్


Next Story

Most Viewed