పుష్ప-2 టీమ్ బస్సుకు రోడ్డు ప్రమాదం .. ఏడుగురికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 9 |
పుష్ప-2 టీమ్ బస్సుకు రోడ్డు ప్రమాదం .. ఏడుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప2 సినిమా బృందానికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన నార్కట్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరగగా.. ఏడుగురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. సినిమా బృందం ప్రయాణిస్తున్న బస్సు, ఆర్టీసీ బస్సు బలంగా డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. వారిని సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో స్థానికులు 100కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. సినిమా బృందం భద్రాచలం నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. పాన్ ఇండియా మూవీ పుష్పకు సీక్వెల్ గా పుష్ప -2 ను డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

Also Read: నాటు నాటుకు ఉక్రెయిన్ ఆర్మీ స్టెప్పులు (వీడియో)

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత



Next Story

Most Viewed