ప్రభాస్ అభిమానులతో హోరెత్తిన తిరుపతి

by Disha Web Desk 7 |
ప్రభాస్ అభిమానులతో హోరెత్తిన తిరుపతి
X

దిశ, తిరుపతి: ఏప్పుడూ వెంకన్న సామి భక్తులతో కిటకిటలాడే తిరుపతి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 లకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఉదయం నుండే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దీంతో తిరుపతి రోడ్లు అన్నీ జనసందోహంగా మారాయి. ప్రభాస్ అభిమానులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని మరీ ఈ ఈవెంట్‌కు వస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ ఈవెంట్‌కు దాదాపు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందట. దీంతో పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. ఉదయం నుండే చాల చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు నియమించారు. భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. రామాయణ గాధ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.

Read more: సంప్రదాయ దుస్తుల్లో రెబల్ స్టార్‌ ప్రభాస్‌.. పోటీపడ్డ అభిమానులు


Next Story

Most Viewed