- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Poonam Kaur: ప్లీజ్ నన్ను అలా చూడొద్దు: వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్
ప్రముఖ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది.

దిశ, సినిమా : ప్రముఖ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనదైన కామెంట్స్తో హంగామా చేసే పూనమ్.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భావోద్వేగంతో మాట్లాడింది. ‘నేను తెలంగాణలోనే పుట్టి పెరిగాను. నా మతాన్ని చూపించి, నన్ను పంజాబీగా ఈ రాష్ట్రం నుంచి వేరు చేయలేరు. నేను మీ అందరిలానే తెలంగాణ బిడ్డని. మళ్లీ చెబుతున్నా.. దయచేసి మైనారిటీ అని, సిక్కు అని.. నన్ను వేరు చేసి చూడొద్దని వేడుకుంటున్నా’ అంటూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే మెడికో స్టూడెంట్ ప్రీతిని తలచుకుంటూ మన సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: అయ్యో పాపం.. నాగార్జున వల్లే చైతూ తన పెళ్లి జీవితాన్ని నాశనం చేసుకున్నాడా?






