- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి ప్రాణాలు కాపాడండి.. మోదీ, రేవంత్ రెడ్డికీ కీలక విజ్ఞప్తి చేస్తూ రాహుల్ రామకృష్ణ ఎమోషనల్ పోస్ట్
ఈ మందు తాగిన కేసులు భారీగా పెరుగుతుండటంతో డాక్టర్లు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దయచేసి దీన్ని త్వరగా బ్యాన్ చేసి ప్రాణాలను కాపాడండి.

దిశ, సినిమా: టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు పారాక్వాట్ అనే ప్రమాదకరమైన గడ్డిమందు తాగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఎంతో ఆవేదనతో ట్విట్టర్ వేదికగా పంచుకున్న రాహుల్.. ఈ ప్రాణాంతక రసాయనాన్ని వెంటనే నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కోరారు. తన సోదరుడి మరణానికి కారణమైన పారాక్వాట్ ఎంత ప్రమాదకరమైనదో రాహుల్ రామకృష్ణ వివరించారు. "ఈ రోజు నా సోదరుడిని పారాక్వాట్ విషప్రయోగం వల్ల కోల్పోయాను. ఇది అత్యంత ప్రాణాంతకమైనది. ఆత్మహత్యాయత్నాల కోసం దీనిని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. మార్కెట్లో ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి నేను షాక్కు గురయ్యాను.
ఈ మందు తాగిన కేసులు భారీగా పెరుగుతుండటంతో డాక్టర్లు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దయచేసి దీన్ని త్వరగా బ్యాన్ చేసి ప్రాణాలను కాపాడండి" అని ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. పారాక్వాట్ అనేది కలుపు మొక్కలను చంపడానికి వాడే రసాయనం. దీనికి విరుగుడు లేకపోవడంతో, చిన్న మొత్తంలో శరీరంలోకి వెళ్లినా ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతిని మనిషి చనిపోయే అవకాశం 80-100% ఉంటుంది. తెలంగాణలో ప్రతి ఏటా ఈ మందు వల్ల వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాల్లో దీన్ని నిషేధించగా, భారతదేశంలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దీనిపై ఆంక్షలు ఉన్నాయి. రాహుల్ రామకృష్ణ సోదరుడి మరణంతోనైనా ఈ ప్రాణాంతక రసాయనంపై పూర్తి నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






