లైలాను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు.. కార్తీ

by Dishanational4 |
లైలాను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు.. కార్తీ
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం 'సర్దార్'. పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. కాగా ఈ సినిమాలో కార్తీ సరికొత్త అవతార్‌లో డ్యూయల్ రోల్‌‌లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత వెండితెరపైకొస్తున్న ఆమె.. డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కార్తీ మాట్లాడుతూ 'ఆమె పాత్ర వల్ల ఈ సినిమా కథ మలుపు తిరుగుతుంది. నాతో పాటు లైలాను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు' అని చెప్పాడు. రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్‌లు‌గా నటించిన ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి : బాలయ్యతో త్రిష రొమాన్స్.. కోటి రూపాయలకు ఒప్పందం.!

Next Story

Most Viewed