మళ్లీ బుక్కైన న‌రేష్, ప‌విత్రా లోకేష్..

by Disha Web Desk 23 |
మళ్లీ బుక్కైన న‌రేష్, ప‌విత్రా లోకేష్..
X

దిశ, వెబ్‌డెస్క్ : న‌రేష్, ప‌విత్రా లోకేష్ క‌లిసి న‌టించిన చిత్రం ‘మ‌ళ్లీ పెళ్లి’. ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ మే 11న విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. తెలుగు, క‌న్నడ భాష‌ల్లో మ‌ళ్లీ పెళ్లి చిత్రాన్ని ఈ నెల 26న విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ సిద్ధమ‌య్యారు. ఈ ట్రైల‌ర్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో చిత్రాన్ని తెర‌కెక్కించిన ఎం.ఎస్‌.రాజు ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై ఉన్న న‌రేష్‌ను, ప‌విత్రా లోకేష్‌ల‌ను అస‌లు ‘మ‌ళ్లీ పెళ్లి’ ఏంటి? అని ప్రశ్నించారు. దీంతో నరేష్, పవిత్రా లోకేష్‌లను ఎం.ఎస్.రాజు ఇలా బుక్ చేశాడేంటి? అని అనుకుంటున్నారు. ఈ సినిమా కథ గురించి వేసిన ప్రశ్నకు నరేష్‌ సమాధానం ఇస్తూ, రఘుపతివెంకయ్యనాయుడు బయోపిక్‌‌లో నేను నటించాను. కానీ మళ్లీపెళ్లి సినిమా అనేది నా బయోపిక్‌ కాదు. ప్రతివారికి ఏదో ఒకచోట కనెక్ట్‌ అయ్యేలా రాజుగారు కథను తీసుకువచ్చారు. ఇది నా కథ కాదు అంటూ చెప్పుకొచ్చారు.

దర్శకుడు ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ, జీవితంలో అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. నాకూ జరిగాయి. ముందు నుంచి నేను దర్శకుడిని అవ్వాలనుకున్నా. 13 ఏళ్ల వయస్సులో మీనా సినిమాను మా కుటుంబంతో చూశాను. ఇప్పుడు విజ‌య కృష్ణ బ్యాన‌ర్‌లో నేను దర్శకత్వం వహిస్తానని ఊహించలేదు. ఈ సందర్భంగా నరేష్‌‌కూ, పవిత్రగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా దర్శకత్వం టీమ్‌‌కు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

మొదటి సారి ఆ వీడియోను షేర్ చేసిన నమ్రత..

Next Story

Most Viewed