మా కూతుళ్ల విషయంలో చాలా భయపడ్డాను : jeevitha Rajasekhar

by Disha Web Desk 10 |
మా కూతుళ్ల విషయంలో చాలా భయపడ్డాను : jeevitha Rajasekhar
X

దిశ, సినిమా: సీనియర్ హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరిద్దరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా " అహ నా పెళ్లంట " మూవీతో రాజ్‌తరుణ్ సరసన హీరోయిన్‌గా నటించిన శివాని ఇప్పుడు 'విద్యా వాసుల అహం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు శివాత్మిక " పంచతంత్రం " సినిమాలో నటించింది. రీసెంట్‌గా ఈ సినిమా విడుదల సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ..తమ కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.." చిన్నప్పటి నుంచి శివాని, శివాత్మిక సినీ కుటుంబంలోనే పెరిగారు. ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక సినిమాల్లో నటిస్తామని చెప్పారు. అప్పుడు నేను, రాజశేఖర్ చాలా టెన్షన్ పడ్డాం. సినిమాల్లో రాణించడం అంత సులువు కాదు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏది కావాలన్నా ఇచ్చాం. కానీ ఇండస్ట్రీలో రాణించాలంటే నటనలో నిరూపించుకోవాలి. నేను నా కూతుళ్లకు ఒకటే చెప్పాను. మీరు సినిమాల్లో నటించడం మాకెలాంటి అభ్యంతరమూ లేదు. మా వంతు మేం సపోర్ట్ చేస్తాం. కానీ సినిమాల్లో రాణించినా, రాణించకపోయినా మీరు బాధపడకూడదని సలహా మాత్రమే ఇచ్చాను " అని చెప్పుకొచ్చింది జీవితా రాజశేఖర్.

Read more:

నటి షాకింగ్ కామెంట్స్.. నా భర్తకి నా కంటే ఆ హీరోయినే పిచ్చి ఇష్టం



Next Story

Most Viewed