- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోలీవుడ్ను షేక్ చేయడానికి రెడీ అయిన జాన్వీ కపూర్.. స్టార్ కిడ్ సరసన చాన్స్!
టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. ఇప్పుడు కోలీవుడ్ను కూడా షేక్ చేయడానికి రెడీ అవుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా అమ్మడు బ్యాక్ టు బ్యాక్ చాన్స్లు రాబట్టుకుంటూ.. ఫుల్ ఫామ్లో ఉంది. అనతి కాలంలోనే ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఈ భామ త్వరలో ‘పెద్ది’ సినిమాతో టాలీవుడ్ను షేక్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేయనుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 4న థియేటర్స్లోకి రాబోతుంది. తాజాగా, జాన్వీ కపూర్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. ఇప్పుడు కోలీవుడ్ను కూడా షేక్ చేయడానికి రెడీ అవుతోంది.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ సరసన ఆమె ఒక కొత్త సినిమాలో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్గా మారాయి. ఇప్పటికే తెలుగులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన జాన్వీ.. ఇప్పుడు కోలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. నటన, అందం, డ్యాన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే జాన్వీ కపూర్.. ఇటు యాక్టింగ్ పరంగా సత్తా చాటుతున్న ధృవ్ విక్రమ్తో జతకట్టడంపై నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్లో ఉన్న జాన్వీ కపూర్ క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.






