- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వందమంది ఫైటర్లతో ఆ సెట్లో యాక్షన్ సన్నివేశాలు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

దిశ, వెబ్డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కర్ణాటకలోనూ విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం భాగ్యనగరంలో చిత్రీకరణ జరుగుతుంది. 1969 కాలంలో చైనా, బూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని టాక్. ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ ఫారెస్ట్ సెట్ని నిర్మించి, వందమంది ఫైటర్లతో ఆ సెట్లోనే యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్నీల్ చిత్రీకరించారని వినికిడి. దీంతో ఫ్యాన్స్ ఈసారి ఎన్టీఆర్ భీభత్సం చూస్తాము కావచ్చు అని అంటున్నారు. కాగా ఈ ఏడాది జూన్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.
Read More..






