- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోవా.. విజయ్, త్రిష రిలేషన్పై సనమ్ శెట్టి సంచలన పోస్ట్
విజయ్, త్రిష కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ సనం శెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, సినిమా: కోలీవుడ్ దళపతి విజయ్(Thalapathi Vijay), ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ప్రస్తుతం దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద సంచలనంగా మారింది. సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధానికి ఈ జంట ముగింపు పలకడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలకు ఒక హీరోయిన్ కారణమనే ప్రచారం జరుగుతుండటం ఈ వివాదాన్ని మరింత పెంచింది. విజయ్ గత కొంతకాలంగా ఒక ప్రముఖ నటితో రిలేషన్లో ఉన్నారని, ఆ కారణం చేతనే తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆ నటి మరెవరో కాదు, త్రిషనే అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీరిద్దరూ గతంలో అనేక హిట్ సినిమాల్లో నటించడం, ఇటీవల మళ్లీ కలిసి కనిపిస్తుండటంతో ఈ అనుమానాలు బలపడ్డాయి.
విడాకుల రచ్చ జరుగుతున్న సమయంలోనే విజయ్, త్రిష కలిసిఓ పెళ్లికి హాజరుకావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ జంటగా నిలబడి ఫోటోలకు ఫోజులివ్వడం చూసిన అభిమానులు అవాక్కయ్యారు. విజయ్ తన భార్యతో మళ్లీ కలిసి ఉండాలని కోరుకుంటున్న ఫ్యాన్స్కు, ఆయన త్రిషతో కలిసి బహిరంగంగా తిరగడం మింగుడుపడటం లేదు. భార్య బాధను ఏమాత్రం పట్టించుకోకుండా విజయ్ ఇలా ప్రవర్తించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఈ వ్యవహారంపై విజయ్ వీరాభిమాని, నటి సనం శెట్టి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. విజయ్, త్రిష కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘ఒక భార్య పడుతున్న బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం చాలా విచారకరం. ఎంతో కాలంగా మిమ్మల్ని ఆరాధిస్తున్న మాలాంటి అభిమానులను మీరు తీవ్రంగా నిరాశపరిచారు’’ అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం సనం శెట్టి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి, కొందరు సనం శెట్టి వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు విజయ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా, ఒక స్టార్ హీరో కుటుంబంలో జరిగిన ఈ గొడవ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.






