జమ్మికుంటలో గోశాల ఏర్పాటుకు వినతిపత్రం..

by Kodari Anjali |

గోమాతల సంరక్షణ కోసం గోశాల ఏర్పాటు చేయాలని కోరుతూ తాహసీల్దార్ కార్యాలయంలో పూదరి రేణుక శివకుమార్ ఎంఆర్వోకు వినతిపత్రం అందించారు.

జమ్మికుంటలో గోశాల ఏర్పాటుకు వినతిపత్రం..
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో రోడ్లపై తిరిగే గోమాతల సంరక్షణ కోసం గోశాల ఏర్పాటు చేయాలని కోరుతూ తాహసీల్దార్ కార్యాలయంలో పూదరి రేణుక శివకుమార్ ఎంఆర్వోకు వినతిపత్రం అందించారు. పూదరి రేణుక శివకుమార్ మాట్లాడుతూ... జమ్మికుంట పట్టణంలోని రోడ్లు, బజార్లలో ఆవులు, దూడలు యథేచ్ఛగా తిరుగుతున్నాయని తెలిపారు. వాహన ప్రమాదాల బారిన పడటంతో పాటు ప్లాస్టిక్, చెత్త తిని అనారోగ్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల గోమాతల రక్షణ, సంరక్షణ కోసం పట్టణంలో తక్షణమే గోశాల ఏర్పాటు చేయాలని కోరారు. దీని కోసం ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Next Story