- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్కార్ వేదికపై ధర్మేంద్రకు అవమానం.. ఇది సిగ్గు చేటు అంటూ హేమమాలిని ఫైర్!
ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్న నటుడిని వారు మర్చిపోవడం విచారకరం.

దిశ, సినిమా: మరపురాని చిత్రాలను అందించిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర 2025 నవంబర్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆయనకు జరిగిన అవమానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి ఏటా మరణించిన సినీ ప్రముఖులకు ఇచ్చే ఇన్ మెమోరియం నివాళి విభాగంలో ధర్మేంద్ర పేరు లేకపోవడంపై ఆయన భార్య, నటి హేమమాలిని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హేమమాలిని స్పందిస్తూ.. "ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్న నటుడిని వారు మర్చిపోవడం విచారకరం. మీరు గౌరవించకపోయినా.. ధర్మ్ జీకి ఎక్కడికి వెళ్లినా గుర్తింపు ఉంది" అని మండిపడ్డారు. ఆయనకు తన జీవితకాలంలో పెద్దగా అవార్డులు రాలేదని, ఆస్కార్ గురించి ఆయన ఎప్పుడూ బాధపడలేదని ఆమె గుర్తుచేశారు.
మన దేశ ప్రజల ప్రేమ పొందినప్పుడు అవార్డులతో పనిలేదని, తన సినిమాలకు కూడా అవార్డులు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. తన తండ్రి ఇలాంటి విషయాలను అస్సలు పట్టించుకోరని పేర్కొంది. కాగా.. ఈసారి ఆస్కార్ వేడుకలో నివాళి కార్యక్రమం గతంలో కంటే 15 నిమిషాల ఎక్కువే జరిగింది. హాలీవుడ్ దిగ్గజాలకు ప్రత్యేక నివాళులు అర్పించినప్పటికీ, ధర్మేంద్రను మాత్రం టీవీ ప్రసారంలో చూపించలేదు. అయితే, ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన అధికారిక ఆన్లైన్ జాబితాలో మాత్రం ధర్మేంద్రతో పాటు భారత్ నుంచి సరోజా దేవి, మనోజ్ కుమార్, జయశ్రీ కబీర్, కోట శ్రీనివాసరావు మరియు ఎస్. కృష్ణస్వామి పేర్లను చేర్చారు.






