Tollywood Drug case: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్స్ వీరే

by Disha Web Desk 23 |
Tollywood Drug case: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్స్ వీరే
X

దిశ, సినిమా: ప్రజంట్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు ఊపేస్తోంది. తాజాగా నిర్మాత KP Chaudharyడ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఊపేస్తున్న కొంతమంది నటిమణులు, ఒకప్పుడు ఈ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో దీపికా పదుకొనె ఒకరు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు డ్రగ్ కేసుగా టాక్ నడిచింది. ఇందులో దీపికా పదుకొనె పేరు వినిపించింది. దీంతో ఆమెను ముంబై ఎన్సీబీ అధికారులు విచారించారు. ఇక నెక్ట్స్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా రెండు పర్యాయాలు డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొంది. సుశాంత్‌తో సారా అలీఖాన్ కొన్నాళ్లు సన్నిహితంగా ఉన్న కారణంగా ఆయన మరణం అనంతరం డ్రగ్ ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంది సారా. శ్రద్దా కపూర్ సైతం డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంది. 2001లో కన్నడ హీరోయిన్ సంజన గల్రాని డ్రగ్ కేసులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపింది. తనతో పాటు రాగిణి ద్వివేది అనే మరో హీరోయిన్ కూడా ఉంది. టాలీవుడ్ హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్ కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Read more: రష్మిక మనసు బాగోలేకపోతే గదిలోకివెళ్లి ఆ పని చేస్తుందట!



Next Story

Most Viewed