హోటల్ గదిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన స్టార్ కమెడియన్

by Disha Web Desk 6 |
హోటల్ గదిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన స్టార్ కమెడియన్
X

దిశ, సినిమా : ప్రముఖ హాస్యనటుడు ఖ్యాలీపై అత్యాచార కేసు నమోదైంది. జైపూర్ హోటల్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 25 ఏళ్ల యువతి ఆరోపించింది. దీంతో సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాస్యనటుడిపై మంగళవారం మానసరోవర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. AAP కార్యకర్త అయిన ఖ్యాలీ.. మద్యం మత్తులో ఉన్నపుడు మానసరోవర్ ప్రాంతంలోని ఒక హోటల్ గదిలో ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు దాదాపు నెల రోజుల క్రితం కమెడియన్‌తో పరిచయం ఏర్పడిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై IPC సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేసినట్లు సబ్-ఇన్‌స్పెక్టర్ సందీప్ యాదవ్ తెలిపారు. శ్రీగంగానగర్‌కు చెందిన ఆమె ఓ కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఖ్యాలీ ఒక హోటల్‌లో రెండు గదులను బుక్ చేసి ఒక్కోదాంట్లో ఇద్దరు మహిళలను ఉంచాడని, వాళ్లకు బలవంతంగా బీర్ తాగించి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

రాజమౌళి టీమ్ ‘ఆస్కార్‌’ను కొనేసిందా? చర్చనీయాంశమైన సెలబ్రిటీ ట్వీట్..



Next Story

Most Viewed