రోశయ్య గొప్ప ఆర్థిక నిపుణులు : మంత్రి సత్యవతి రాథోడ్

by  |
రోశయ్య గొప్ప ఆర్థిక నిపుణులు : మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్ ప్రతిపాదించిన గొప్ప ఆర్థిక నిపుణులు రోశయ్య అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆయన రాజకీయ చాణక్యులని కొనియాడారు. మాజీ గవర్నర్ రోశయ్య ఆకస్మికంగా మృతి చెందడంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రోశయ్య పార్థివదేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో అనేక పదవులు అలంకరించి, వాటికి వన్నె తెచ్చారని ప్రశంసించారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని తెలియచేశారు.

ఆదివారం మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

Next Story