ఆదివారం మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

by  |
ఆదివారం మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం స్టార్ ఆసుపత్రి నుంచి రోశయ్య పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో ఆయన నివాసానికి తరలించారు. రేపు (ఆదివారం) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు.

ఆదివారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచి.. మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.

రోశయ్య మరణం తెలుగువారికి తీరని లోటు : పవన్ కళ్యాణ్

Next Story

Most Viewed