కంగనా రనౌత్ పిచ్చిది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by  |
Kangana Varun
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉంటుంది. రాజకీయ నాయకులపై, బాలీవుడ్ దర్శక, నిర్మాతలపై తరచూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తలో నిలుస్తోంది. ఇటీవల భారతదేశ అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మ శ్రీని అందుకుంది. అయితే ఇటీవల కంగనా.. ఒక ప్రైవేట్ టీవీ న్యూస్ చానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్‌కు 2014లో స్వాతంత్య్రం వచ్చిందని, 1947లో లభించిందో భిక్ష అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాగా, ఆమెపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కంగనా రనౌత్ గతంలో చాలాసార్లు మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించి మాట్లాడిందని మండిపడ్డారు. 2014లో స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. నాటి ఉద్యమంలో పాల్గొన్న మంగళ్ పాండే, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తోపాటు లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఆమె కించపరిచిందని ఫైర్ అయ్యారు. దీన్ని పిచ్చి అని పిలవాలా లేదా దేశద్రోహం అని పిలవాలా అని ప్రశ్నించారు

ఐదేళ్ల తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్

Next Story