- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఆర్టీసీ బస్సులో బాలికతో పాటు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని చండ్రుగొండ మండలం సీతాయి గూడెంకు చెందిన అనూష అనే బాలికను అదేగ్రామానికి చెందిన జగ్గారావు (28 ) అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. జగ్గారావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తాడు.
అయితే ఈ క్రమంలోనే అనూషను ప్రేమ పేరుతో మభ్యపెట్టి తనను సోమవారం బయటకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఏమైందో తెలియదు కానీ మంగళవారం సాయంత్రం అశ్వారావు పేట బస్సులో పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. వీరిని గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్ ఒక్కసారిగా షాకై వారిని హుటాహుటిన బస్సులోనే ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స అందిస్తున్న సమయంలో నే ఇద్దరూ కూడా మృతి చెందారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందిచడంతో వారు ఆసుపత్రికి చేరుకున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన తన కూతురిని విగత జీవిగా చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.