ఈ టీచర్ రూటే వేరు.. 93 వయసులో ఎంతటి సాహసం చేసిందంటే?

by Disha Web Desk 2 |
ఈ టీచర్ రూటే వేరు.. 93 వయసులో ఎంతటి సాహసం చేసిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. వండుకోవడానికి చేతకాక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడానికి చేతకాక వాషింగ్ మెషీన్ వాడటం, నడవటం చేతకాక వాహనాలు వాడటం ఇలా అన్నింట్లో మనిషులు సుఖపడటానికి అలవాటు పడుతున్నారు. ఈ బద్దకం అనేది మధ్య వయసున్న వాళ్ల నుంచి చిన్నపిల్లలవరకూ పాకింది. కానీ, ఓ 93 పండు ముసలి ఉపాధ్యాయరాలు రోజు 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా.. ఆమె సాహసంపై ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడు పీవీపీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అభినందించారు. ''కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు అన్నారు శ్రీశ్రీ, ఈ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ, 93 ఏళ్ల వయసులో రోజు 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్ శాంతమ్మ గారికి వందనాలు.'' అంటూ సోషల్ మీడియా వేదికగా పీవీపీ అభినందించారు.

ఎమోషన్స్‌ ఆధారంగా గేమింగ్ ఇబ్బందులను మార్చేసే AI మోడల్‌

యజమానిని కొట్టి చంపిన కంగారూ.. 85 ఏళ్ల తర్వాత ఇదే మొదటి ఘటన

Next Story

Most Viewed