ఈ గింజలు రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

by Disha Web Desk 15 |
ఈ గింజలు రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
X

దిశ, వెబ్​డెస్క్​ : ఈ గింజలు రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. సుమారు 20 రోగాలపై ఈ గింజలు బ్రహ్మస్త్రంగా పని చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. అవే అవిశగింజలు. ఈతరం వారిలో చాలా మందికి ఈ గింజల గురించి తెలిసి ఉందడు. కానీ పూర్వకాలంలో వీటిని విరివిరిగా వాడేవారు. చూడటానికి ఉలవలలాగా ఉండి జారుతూ ఉంటాయి. తింటే ఎగుటు వాసన ఉంటాయి. వీటిని నేరుగా తినడం కాస్త ఇబ్బందిగా ఉన్నా అవి చేసే ప్రయోజనాలు తెలిశాక వద్దన్నా తినకుండా ఉండలేరు.

ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

ఈ గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా చెడు కొలస్ట్రాలు తగ్గించి మంచి కొలస్ట్రాలను పెంచుతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలస్ట్రాలను కరిగించి గుండెజబ్బులు రాకుండా ఉపయోగపడతాయి. ఇందులోని ఒమెగా ఆమ్లాలు రక్తం పలచగా మారడానికి ఉపయోగపడతాయి. కంచి చూపును మెరుగు పరుస్తాయి. రేచీకటి రాకుండా కాపాడుతుంది. లివర్​ ఫంక్షనింగ్​ను ఉత్తేజపరుస్తాయి. వీటిలో ఐరన్​, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో స్థూలకాయం తగ్గుతుంది.

అలాగే సంతానలేమిని నిరోధిస్తుంది. వీటిని తరుచుగా తీసుకోవడంతో వీర్యకణాల వృద్ధి పెరుగుతుంది. బీపీని నియంత్రిస్తుంది. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల ఈ పొడిని కలుపుకొని తింటే బీపీ కంట్రోల్​లో ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గముఖం పడతాయి. జట్టు రాలడం తగ్గి పొడవుగా పెరగడానికి దోహదపడుతుంది. ఇన్ని ప్రయోజనాలను కలిగిన అవిశగింజలను రోజూ తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Read more :

మెంతులు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే

మీ పెరట్లో తేనెతుట్టె ఉందా.. అయితే మీరు అదృష్టవంతులే



Next Story

Most Viewed