అధికారంలోకి వస్తే అన్ని యాత్రలు ఉచితం… సీఎం సంచలన హామీ

by  |
Delhi CM Arvind Kejriwal
X

దిశ, వెబ్‌డెస్క్ : గోవాలో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ, టీఎమ్‌సీ పార్టీలు అన్ని గోవాలో మకాం వేశాయి. దీనిలో భాగంగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోవాలో జరిగే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఉచిత యాత్ర సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ‘‘గోవాలో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. హిందువులకు అయోధ్య యాత్ర, క్రైస్తవులకు వేలంకన్నికి, ముస్లింల కోసం అజ్మీర్ షరీఫ్ యాత్రను, అలాగే సాయిబాబాను పూజించే వారికి షిర్డీ యాత్రకు ప్రయాణ సదుపాయాలు ఉచితంగా ఏర్పాటు చేస్తాం’’ అని కేజ్రీవాల్ హామీ ఇచ్చాడు.

టీఆర్‌ఎస్ అనూహ్య నిర్ణయం.. విజయగర్జన సభ వాయిదా


Next Story