- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిలక్ వర్మ వీర విధ్వంసం: 45 బంతుల్లోనే 'సునామీ' సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ యువ సంచలనం తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మ తన బ్యాటింగ్తో సునామీ సృష్టించాడు.

దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ యువ సంచలనం తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మ తన బ్యాటింగ్తో సునామీ సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయ సెంచరీ (101)* బాది, ముంబయి ఇండియన్స్కు భారీ స్కోరును అందించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ముంబయి ఇండియన్స్ 199 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. అహ్మదాబాద్ పిచ్పై ఈ లక్ష్యం ఛేదించడం గుజరాత్కు సవాలుతో కూడుకున్నదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. తిలక్ వర్మ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోనుంది. అంతకుముందు నమన్ ధిర్ కూడా 32 బంతుల్లో 45 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రబాడా మూడు వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీశారు.






