నల్ల రిబ్బన్లతో గ్రౌండ్లో ముంబై జట్టు

by Muthe.Rajitha |   (  Updated:2026-04-30 14:51:44  IST  )

హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో ముంబై జట్టు సభ్యులు తమ చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్లోకి దిగడం చర్చనీయాంశం అయింది.

నల్ల రిబ్బన్లతో గ్రౌండ్లో ముంబై జట్టు
X

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(MI), హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో ముంబై జట్టు సభ్యులు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్లోకి అడుగు పెట్టారు. ముంబై ఇండియన్స్ జట్టు సపోర్ట్ స్టాఫ్ లోని ఓ వ్యక్తి కూతురు ఇటీవల మరణించడమే ఇందుకు కారణం. ఆ అమ్మాయి మరణానికి సంఘీభావంగా జట్టు సభ్యులు చేతులకు నల్ల రిబ్బన్లు ధరించారని ముంబై జట్టు నిర్వాహకులు స్టేట్మెంట్ విడుదల చేసారు. ఇక ఈ మ్యాచులో ముంబై 243 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. దానిని హైదరాబాద్ సునాయాసంగా చేధించింది.

Read More.. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లీన్ స్వీప్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ రెండూ ‘ఆరెంజ్ ఆర్మీ’ ఖాతాలోకే!

Next Story