సభలో అసలు ఆమె పేరు కుడా ప్రస్తావించలేదు.. బాబువి అన్ని డ్రామాలు.. పేర్ని నాని

by  |
nani
X

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తన భార్యపై వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు కావాలనే డ్రామాలు ఆడుతున్నారని.. ఆయనే సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు మీడియా ముందు బోరున విలపించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఇందుకు సంబంధించిన రాజకీయ వేడి ఇంకా చల్లారడం లేదు.

ఈ ఘటనపై నందమూరి కుటుంబీకులు స్పందించారు. ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేత, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఇక నందమూరి బాలకృష్ణ వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే నందమూరి కుటుంబసభ్యుల వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజం తెలుసుకోకుండా తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆయన వాపోయారు. సభలో ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు మాటలు నమ్మి వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం డ్రామా ఆడారని మండిపడ్డారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులెవరూ చంద్రబాబు భార్య పేరు ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు. బాబు కావాలనే నాటకం ఆడారని మండిపడ్డారు.

స్పీకర్‌గా తమ్మినేని అన్‌ఫిట్…..మళ్లీ చంద్రబాబు గెలిస్తే జగన్ పరిస్థితేంటి?…వైసీపీ నేతలపై జగ్గారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు

epaper – 4:30 PM AP EDITION (20-11-21) చదవండి



Next Story

Most Viewed