ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి: డైరెక్టర్ రాజమౌళి

by  |
Rajamauli-Director1
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి తనకు బాధ కలిగించే సంఘటనల గురించి ఇటీవల ఓ విద్యాసంస్థలో జరిగిన వేడుకల్లో పాల్గొని చెప్పుకొచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఆయనను విద్యార్థులు పలు ప్రశ్నలు అడుగగా వాటికి సమాధానం ఇచ్చారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు. అదేమిటంటే.. సార్.. మీరు స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు.. మీ జీవితంలో మీకు బాధకలిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని అడగగా.. దీనికి రాజమౌళి సమాధానమిస్తూ చాలా ఉన్నాయి కానీ, అందులో బాగా గుర్తుకు వచ్చే సంఘటన మగధీర మూవీ షూటింగ్ సమయంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు గుంతలో పడిపోయింది.. ఆ సమయంలో తన భార్య తలకు గాయమైందని.. ఆ సమయంలో 15 నిమిషాలపాటు తనకేమీ అర్థంకాలేదు అని.. అప్పటి నుంచి తనకు ఎప్పుడైనా ఆ సంఘటన గుర్తుకువస్తే తన కళ్లల్లో నీళ్లొస్తాయని చెప్పుకొచ్చారు. ఇలా చాలా విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. జనవరి 7, 2022న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం విధితమే.

Read more :

Samantha : ‘సూపర్ హీరోస్‌’ కోసం ఎదురు చూస్తున్నానంటున్న సమంత


Next Story

Most Viewed