దిశ ఎఫెక్ట్ : కదిలిన సీఎంవో.. పోస్టింగ్‌లపై ఆర్డర్లు జారీ

by  |
దిశ ఎఫెక్ట్ : కదిలిన సీఎంవో.. పోస్టింగ్‌లపై ఆర్డర్లు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పదోన్నతులు పొందిన ఎక్సైజ్​ అధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్​ ఆర్డర్లు జారీ అయ్యాయి. దాదాపు 26 రోజులుగా పెండింగ్​లో ఉన్న ఫైల్​కు మోక్షం లభించింది. ఎక్సైజ్​లో పోస్టింగ్​ ఆర్డర్లు పెండింగ్​పై రెండు రోజుల కిందట ‘దిశ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై మంత్రి శ్రీనివాస్​గౌడ్‌తో పాటు పలువురు సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పదోన్నతులు పొందిన ఆబ్కారీ అధికారులకు మంగళవారం ఉదయం నుంచి ఆర్డర్లు జారీ చేస్తున్నారు.

GO Rt. No. 184, Promotions

ప్రస్తుతం ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ల పోస్టింగ్​ జీవో విడుదలైంది. తొలుతగా 12 మందికి పోస్టింగ్​లిచ్చారు. రంగారెడ్డి డీసీగా డేవిడ్​ రవికాంత్, మహబూబ్​నగర్​ అసిస్టెంట్​ కమిషనర్‌గా దత్తురాజ్​ గౌడ్, మెదక్​ ఎన్‌ఫోర్స్​మెంట్​ ఏసీగా రఘురాం, నల్గొండ ఎన్​ఫోర్స్​మెంట్​ఏసీగా శంభుప్రసాద్, రంగారెడ్డి ఎన్‌ఫోర్స్​మెంట్​ఏసీగా చంద్రయ్య, మేడ్చల్​ ఈఎస్​గా విజయ భాస్కర్, మల్కాజిగిరి ఈఎస్​గా అరుణ్​ కుమార్​, శంషాబాద్​ ఈఎస్​గా ఏనుగుల సత్యనారాయణ, సంగారెడ్డి ఈఎస్​గా గాయత్రి, సరూర్​నగర్​ ఈఎస్​గా టి.రవీందర్​రావు, మహబూబ్​నగర్​ ఈఎస్​గా సైదులు, మెదక్​ ఈఎస్​గా అబ్దుల్​ రజాక్​కు పోస్టింగ్ ఇస్తూ జీవో జారీ చేశారు. మిగిలిన వారికి ఈ రెండు రోజుల వ్యవధిలో ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి :

ఉద్యోగ పదోన్నతులు సీఎం ఓకే చెప్పినా సీఎస్ బ్రేక్.. కారణమేంటో..?


Next Story

Most Viewed