- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయుడి దుశ్చర్య.. స్కూల్ వాటర్ ట్యాంక్లో విషం కలిపిన వైనం
కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్డెస్క్: కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్పై ఉన్న కోపంతో సైన్స్ ఉపాధ్యాయుడు రాజేందర్ (Rajender) దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఏకంగా పాఠశాల ఆవరణలో ఉన్న విద్యార్థులు తాగే వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలిపాడు. దీంతో ఆ నీరు తాగిన మొత్తం 11 మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్ తీవ్ర అస్వస్థతకు గురై భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఉపాధ్యాయుడు రాజేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read More..
OTTs: క్రైమ్ స్కూల్స్ గా ఓటీటీలు.. సహస్ర హత్య కేసు ఓ హెచ్చరిక?






