ఏపూరులో దారుణం.. పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య..

by Disha Web Desk 13 |
ఏపూరులో దారుణం.. పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య..
X

దిశ, సూర్యాపేట ప్రతినిధి: వ్యవసాయ క్షేత్రంలో నిద్రిస్తున్న వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండపల్లి వీరయ్య (43)మంగళవారం తన మిరప తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి హత్యకు గురి అయ్యాడు. తోటలో నిద్రిస్తుండగా హత్యకు గురైయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిద్రిస్తున్న వీరయ్యను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేయగా.. తల, మొండెం వేరు అయ్యాయి. మధ్యాహ్నం నుంచి మృతుడు వీరయ్య ఫోన్ ఎత్తకపోవడం ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లారు. సెల్ లైట్‌తో మృతుడు వీరయ్య ను మిరప తోటలో వెతుకుతుండగా హత్యకు గురైనట్లు గుర్తించారు. సమాచారం అందిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన పరిసరాలను బట్టి చూస్తే రాత్రి హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతుడు వీరయ్య గ్రామంలో వివాద రహితుడని ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని గ్రామస్తులు తెలిపారు. గతంలో వీరయ్య చేపల చెరువు సొసైటీ ఉప చైర్మన్‌గా పని చేశారు. భార్య సైదమ్మ వార్డ్ మెంబర్‌గా ఉన్నారు. భూ తగాదాలు కానీ అక్రమ సంబంధం కారణంగా గాని హత్యకు గురై ఉండొచ్చని గ్రామస్తుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు వీరయ్య కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సూర్యాపేట రూరల్ సీఐ సోమ నారాయణ సింగ్ ఎస్సై యాదవేందర్ రెడ్డి తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో కుక్కిన ప్రియుడు.. అదే రోజు మరొకరితో వివాహం

Next Story