ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో కుక్కిన ప్రియుడు.. అదే రోజు మరొకరితో వివాహం

by Disha Web Desk 12 |
ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో కుక్కిన ప్రియుడు.. అదే రోజు మరొకరితో వివాహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి తన లైవ్ ఇన్ భాగస్వానికి హత్య చేసి మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచిపెట్టాడు. అలాగే అదే రోజు మరో యువతితో వివాహం చేసుకున్న కొద్ది గంటలకే పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు నిక్కీ యాదవ్, నిందితుడు.. సాహిల్ గెహ్లాట్ ఇద్దరు 2018 నుంచి లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు.

వీరిద్దరు.. గ్రేటర్ నోయిడాలో అద్దె ఇంట్లో కలిసి జీవించడం ప్రారంభించారు. కాగా.. 2020 కరోనా.. లాక్ డౌన్ వల్ల ఇద్దరు ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు. నిందితుడు గెహ్లాట్ మరో మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడని, దానికి బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.

దీంతో నిందితుడు సాహిల్.. నిక్కీ యాదవ్‌ను ఫిబ్రవరి 9 లేదా 10 మధ్య రాత్రి కాశ్మీర్ గేట్ సమీపంలో తన కారులోనే గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అతను ఆమె శరీరాన్ని నజాఫ్‌గఢ్ మిత్రాన్ గ్రామ శివార్లో ఉన్న తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన సాహిల్.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

అయితే ఫిబ్రవరి 14 మంగళవారం ధాబా వద్ద ఫ్రిజ్‌లో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి ప్రియుడు సాహిల్ గెహ్లాట్ (24) గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ పోలీసులు క్రైమ్ బ్రాండ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి : ఏపూరులో దారుణం.. పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య..

Next Story

Most Viewed