- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి రన్యా రావుకు ఊరట: ఏడాది తర్వాత జైలు నుంచి విడుదల
భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన సినీ నటి రన్యా రావుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది.

దిశ, వెబ్డెస్క్: భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన సినీ నటి రన్యా రావుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. గత ఏడాది కాలంగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉంటున్న ఆమె, నేడు విడుదల కానున్నారు. సుమారు రూ.102 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు నిందితురాలిగా ఉన్నారు. ఈ భారీ కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గతంలో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. నిజానికి, రన్యారావుకు 2025 మే నెలలోనే ఈ కేసులో బెయిల్ లభించింది. అయితే, విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (COFEPOSA) కింద ఆమెపై చర్యలు ఉండటంతో బెయిల్ వచ్చినా ఆమె విడుదల కాలేదు. గత దాదాపు ఏడాది కాలంగా ఈ చట్టం కారణంగానే ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా 'కోఫెపోసా' చట్టం పరిధిలోని నిబంధనల నుండి కూడా ఆమెకు ఊరట లభించడంతో, విడుదల మార్గం సుగమమైంది. నేడు జైలు నుంచి ఆమె బయటకు రానున్నారు. ఈ పరిణామం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.






