ఏపీలో దారుణం.. గంజాయ్ మత్తులో యువతిని నరికి చంపిన యువకుడు

by Disha Web Desk 19 |
ఏపీలో దారుణం.. గంజాయ్ మత్తులో యువతిని నరికి చంపిన యువకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలన ఘటన వెలుగు చూసింది. గంజాయ్ మత్తులో కంటి చూపు లేని ఓ యువతిని రౌడీ షీటర్ అతిదారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో కంటిచూపు లేని యువతిని రాజు అనే రౌడీ షీటర్ లైంగికంగా వేధించాడు. ఈ విషయం బాధిత యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజు గంజాయ్ మత్తులో యువతి ఇంటికి వెళ్లి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : సరిహద్దు ఘర్షణ...గొడ్డలితో దాడి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed