Hot news: కిలాడీ ఆంటీ.. ఆమె దగ్గరకు లేడీస్ వెళ్తే.. 'నగ్నం'గా రొమాన్స్ చేయాల్సిందే..!

by Disha Web Desk 7 |
Hot news: కిలాడీ ఆంటీ.. ఆమె దగ్గరకు లేడీస్ వెళ్తే.. నగ్నంగా రొమాన్స్ చేయాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్బులు సంపాదించాలనే నెపంలో చాలా మంది దారుణాలు చేస్తుంటారు. కొందరు హత్యలు చేస్తుంటే.. మరికొందరు ఎదుటి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారి జీవితాలతో ఆడుకుంటారు. తాజాగా ఓ మహిళ ఇలాంటి దారుణానికే ఒడిగట్టింది. మహిళల జీవితాలను నాశనం చేస్తూ డబ్బులు సంపాదించడానికి అలావాటు పడింది. ఆ మహిళను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..

విజయవాడ పడమట లంకకు చెందిన గురు నాగసాయి అనే మహిళ స్థానికంగా వస్త్ర దుకాణం నడుపుతుండేది. తన షాపుకు వచ్చిన మహిళలతో పరిచయం పెంచుకుని గురు నాగసాయి కిట్టీ పార్టీలకు ఇంటికి ఆహ్వానించేది. ఇంటికి వచ్చిన యువతులకు, మహిళలకు డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చేది. వారు ఆ మందు తాగి స్పృహ కోల్పోయిన తర్వాత వారిని నగ్నంగా ఫొటోలు తీసి వ్యభిచారం లోకి దింపేందుకు బ్లాక్ మెయిల్ చేసేది. అంతే కాకుండా తన బట్టల షాపునకు వచ్చిన వారు బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు తీస్తూ బెదిరిస్తుండేది. వ్యభిచారం చేయకపోతే ఫొటోలు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేది. విటులకు కూడా ఆ ఫొటోలను చూపించి బేరాసారాలు కుదుర్చుకుంటుందట. ఈ మేరకు ఆమె ఆగడాల గురించి విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు.. ఆపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో కేసు నమోదు చేశారు. గురు నాగసాయిని అదుపులోకి విచారణ చేపట్టారు.

Read more:

1.ఆ నిర్మాత వల్లే నా బతుకు ఇలా అయింది.. Janhvi Kapoor

Next Story