భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

by  |
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత కొద్దిరోజులుగా 12 వేల లోపు కరోనా కేసులు నమోదు అవుతుండగా.. నాలుగు రోజుల నుంచి 13 వేలకు పైగా నమోదు అవుతున్నాయి.

ఆదివారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా 14,264 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 90 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,91,651 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,56,302 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా 1,45,634 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,06,89,715 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 1,10,85,173 మంది టీకా తీసుకున్నట్లు వెల్లడించింది.

తెలంగాణలో తాజాగా 163 కరోనా కేసులు

Next Story