చెక్కుల పంపిణీలో చెడుగుడు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల బాహాబహి

by  |
TRS Congress
X

దిశ, పాలేరు: ముదిగొండలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ముదిగొండ మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సీఎల్పీ నేత, మధిర శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని విడదీసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకుంటూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడికి వచ్చిన లబ్ధిదారులు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితిలో ఉండిపోయారు. అటు రెండు వర్గాలు నినాదాలు చేస్తుండగానే అధికారులు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరి ప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి, ముదిగొండ సర్పంచి మందారపు లక్ష్మి, మార్కెటింగ్ డైరెక్టర్ బంక మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

mudigognda

Next Story

Most Viewed