ఒక భర్త , ఇద్దరు ప్రియులు.. ఆమె కడుపులో బిడ్డకు తండ్రెవరు ?

by  |
ఒక భర్త , ఇద్దరు ప్రియులు.. ఆమె కడుపులో బిడ్డకు తండ్రెవరు ?
X

దిశ, వెబ్‌డెస్క్ : పుట్టే బిడ్డ కోసం పోటీ పడటం ఎక్కడైన చూశారా.. ఒక వేళ చూసినా.. భార్యభర్తలు మనస్పర్ధలు వచ్చి విడిపోయే సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, భర్త ఉండగా ఇద్దరు ప్రియులు బిడ్డ కోసం కొట్టుకోవడం కాస్త విచిత్రంగా ఉంది కదా.. బిడ్డ కోసం ఇద్దరు ప్రియులు కొట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళ్లితే.. ఓ వివాహిత తన భర్తతో కాపురం చేస్తూనే మరో ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిస్తే తండ్రి సంతోషపడాలి కానీ, ఇక్కడ కాస్త విడ్డూరంగా మహిళ గర్భం దాల్చినందుకు ఇద్దరు ప్రియులు సంతోషపడటమే కాకుండా.. పుట్టబోయే బిడ్డకు నేనంటే నేను తండ్రినని ఇద్దరు ప్రియులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని అయోధ్య పట్టణం రామ్‌నగర్‌కు చెందిన మురుగేశన్ రెండో భార్య కలైమణి(23) అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్(23) కృపై రాజ్(23) అనే వారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కలైమణి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన ప్రియులిద్దరికీ శుక్రవారం తెలియజేసింది. దీంతో ఇద్దరు ప్రియు తెలియకుండా ఒకే సారి ప్రియురాలి దగ్గరకు వచ్చారు. అనంతరం కలైమణి కడుపులో బిడ్డకు నేను తండ్రిని అంటే నేను తండ్రిని అని ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆగ్రహానికిలోనైన కలై అరసన్ కత్తితో రాజ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో రాజ్ త్రీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలనానికి చేరుకుని కలైమణి, కలై అరసన్‌ల‌పై కేసు నమోదు చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Read more:

కౌగిలింతలు, ముద్దుల్లో మునిగితేలిన స్టార్ హీరోయిన్ కూతుళ్లు

హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. నేను అలా ప్రేమించలేను

డిస్నీ కార్లతో ప్రేమలో పడిపోయాడు.. గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేశాడు



Next Story

Most Viewed