బాలయ్య తాండవం.. ‘అఖండ 2’ చూసి పిల్లాడు ఏం చేశాడంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-12 06:27:12  IST  )

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’.

బాలయ్య తాండవం.. ‘అఖండ 2’ చూసి పిల్లాడు ఏం చేశాడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండేది. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కొంచెం ఆలస్యమైంది. దీంతో బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎట్టకేలకు ఈరోజు(డిసెంబర్ 12) ‘అఖండ 2’ మూవీ థియేటర్లలో విడుదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలో ‘అఖండ 2’ చిత్రం థియేటర్లలో విడుదలై.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫ్యాన్స్, కామన్ అడియన్స్, పిల్లలు సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పోటెత్తారు. ఈ క్రమంలో సినిమా చూసిన ఓ పిల్లాడు.. బాలయ్య డైలాగ్ చెప్పి.. అదరగొట్టాడు. ‘‘సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలీదు’’ అంటూ బాలుడు చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

అఖండ-2' రివ్యూ చెప్పిన దిల్ రాజు.. అదే హైలెట్

Next Story