రీతూను డిమోన్‌కు దూరంగా ఉండమని దివ్వెల మాధురికి చెప్పిన రీతూ మదర్.. క్లారిటీ ఇచ్చి ఆమె పరువు తీసేసిందిగా (వీడియో)

by I. Sairam |   (  Updated:2025-12-10 10:00:24  IST  )

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9).

రీతూను డిమోన్‌కు దూరంగా ఉండమని దివ్వెల మాధురికి చెప్పిన రీతూ మదర్.. క్లారిటీ ఇచ్చి ఆమె పరువు తీసేసిందిగా (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9). గత వారం అనూహ్యంగా రీతూ చౌదరి(Reethu Chowdary) బయటకు రాగా ఈ వారం పవన్ కళ్యాణ్ తప్ప అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక కొద్ది రోజుల్లో ఫినాలేకు చేరుకోనున్న ఈ షో ప్రజెంట్ రసవత్తరంగా మారింది. అయితే రీతూ చౌదరి బయటికి వచ్చాక వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటుంది.

అయితే ఆమెతో పాటు తన తల్లి కూడా వెంటే ఉంటుంది. ఈ క్రమంలోనే రీతూ తల్లికి ఓ రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. “రీతూ, డిమోన్ రిలేషన్ బాగాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్న దివ్వెల మాధురికి మీరు ఫోన్ చేసి చెప్పారా? అంటూ ఓ రిపోర్టర్ రీతూ తల్లిని నేరుగా అడిగాడు.

దీంతో.. రీతూ తల్లి… మాధురి అన్నీ అబద్ధాలు చెప్పిందని.. తాను ఎవరికీ ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పలేదంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంపై కూడా సెటైర్లు వేసింది. ఇలా మొత్తానికి అందరి ముందు మాధురి పరువును రీతూ చౌదరి తల్లి తీసేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

READ MORE .....

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. నేమ్ కూడా రివీల్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Next Story