- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేధిస్తే అమ్మాయిలు వీడియో తీయండి.. బస్లో వేధింపులపై చిన్మయి
బస్సుల్లో, రైళ్లలో కొంతమంది మహిళలు, యువతులపై వేధింపులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వేధింపులకు గురి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: బస్సుల్లో, రైళ్లలో కొంతమంది మహిళలు, యువతులపై వేధింపులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వేధింపులకు గురి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అవుతున్నాయి. అయితే కేరళ ఘటనలో మాత్రం మహిళ ఫేమస్ అవ్వడం కోసమే తోటి ప్రయాణికుడిని వీడియో తీసి షేర్ చేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే తాజాగా ఓ యువతి నిజంగానే వేధింపులకు గురైంది. తన పక్కన కూర్చున్న ప్రయాణికుడు ఆమెను అసభ్యంగా తాకుతూ ఉన్నాడు.
దీంతో యువతి వెంటనే తన ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేయగా సింగర్ చిన్మయి స్పందించింది. వీడియోను షేర్ చేయడం వల్ల ఆ పురుషుడు ఒక్కసారిగా ఫేమస్ అవుతాడని చిన్మయి పేర్కొంది. ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తారని తెలిపింది. చాలామంది ఆ అమ్మాయిదే తప్పు అని అంటారని, అతడి పక్కన ఎందుకు కూర్చోవాలని ప్రశ్నిస్తారని తెలిపింది. అయినప్పటికీ అమ్మాయిలు వీడియోలు రికార్డ్ చేయాలని, ప్రతిఒక్కటి రికార్డ్ చేయాలని చెప్పింది. అవసరం అయితే వీడియోలు తీసేందుకు ఓ డివైస్ తీసుకోవాలని సూచించింది.






