- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : దేశంలో రోజురోజుకు చిన్నారులు, మైనర్లు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూ ఫిల్మ్స్ చూస్తున్న వారిని గుర్తించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. బ్లూ ఫిల్మ్స్ చూస్తున్న వారి ఫోన్స్, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి నివేదికను ఆయా రాష్ట్రాలకు పంపుతోంది. వారు ఎక్కడున్నా సరే.. పోలీసులు వెంటాడి, వేటాడి మరీ పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. అనంతరం వారిని నేరుగా జైలుకే పంపుతారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 1,095 మందిని అరెస్ట్ చేశారు. పోర్న్ వెబ్సైట్లను చూస్తున్న వారిని.. జాతీయ నేర గణాంకాల బ్యూరో గుర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు పోర్న్ వెబ్సైట్లు చూస్తున్న వారిని గుర్తించేందుకు ఈ బ్యూరో ‘సీ సామ్’ అనే అమెరికన్ సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇస్తున్న వివరాలతోపాటు అదనంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు కూడా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నిందితులను జైలుకు పంపుతున్నాయి. కేరళలో పీ-హంట్ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా.. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్తో మహారాష్ట్ర పోలీసులు సంప్రదించి సైబర్ సెల్ ద్వారా నిందితుల వివరాలను సేకరిస్తున్నారు.
అయితే.. చిన్నారులపై చిత్రీకరించిన బ్లూ ఫిల్మ్స్ చూడటాన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇలా చూస్తూ తొలిసారి దొరికిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నాయి. ఇలా చేస్తూ పోలీసులకు రెండోసారి దొరికితే.. ఏడేళ్లపాటు జైలు శిక్షతో పాటుగా రూ.10 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్లో రెండేళ్ల క్రితం16 కేసులు నమోదు కాగా, ఇందులో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది కూడా 20 కేసులు నమోదు అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
ఆయా పాడుపని.. బాత్రూమ్ లో బాలుడిపై అరాచకం.. సిగరెట్ పీకతో అక్కడ కాల్చి
తల్లి మరొకరితో నగ్నంగా కామక్రీడలు.. కొడుకు చూడటంతో తెల్లారేసరికి..