తల్లి మరొకరితో నగ్నంగా కామక్రీడలు.. కొడుకు చూడటంతో తెల్లారేసరికి..

by  |
తల్లి మరొకరితో నగ్నంగా కామక్రీడలు.. కొడుకు చూడటంతో తెల్లారేసరికి..
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిని మించిన దైవం లేదంటారు. ప్రపంచంలో ఏ తల్లి కడుపునా పుట్టిన బిడ్డను చంపాలనుకోదు. కానీ, నవమాసాలు మోసి, కని,పెంచిన బిడ్డను కర్కశంగా చంపిందో ఓ కసాయి తల్లి. వివాహేతర సంబంధం మోజులో పడి భర్తను వదిలి, వేరొకరితో శారీరక సుఖం అనుభవిస్తూ కన్నకొడుకు కంట్లో పడింది. ఆ విషయం భర్తకు చెప్తాడేమో అన్న భయంతో కన్నపేగును మరిచి ప్రియుడితో కుమారుడును హత్యచేయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి నేడువరంపాక్కకంకి గ్రామంలో సెల్వం అనే వ్యక్తి తన భార్య దుర్గతో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో మధ్య వాడు సూర్య (14). కాగా, భర్త, పిల్లలతో సంతోషంగా జీవించాల్సిన మహిళ దారితప్పింది. అదే గ్రామానికి చెందిన గోపాల కృష్ణన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని కామ క్రీడలలో మునిగితేలుతుండేది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రాసలీలలు సూర్య కంట్లో పడ్డాయి. ఇద్దరు నగ్నంగా బెడ్ పై ఉండడం కొడుకు సూర్య చూసాడు. దీంతో ఎక్కడ తన వివాహేతర సంబంధం గురించి భర్తకు చెప్తాడేమో అని అఘాయిత్యానికి ఒడిగట్టింది.

కొడుకును హతమార్చాలని ప్రియుడిని పురమాయించింది. పక్కా ప్లాన్ ప్రకారం గోపాల్ కృష్ణన్ గతనెల 9న సూర్యను మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితుడు అన్నామలై తో కలిసి హత్య చేశాడు. అనంతరం ఏం ఎరగనట్లు ఇంటికి వచ్చేసాడు. ఇక సూర్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయటికి రావడంతో తల్లి దుర్గను తమదైన రీతిలో విచారించగా హత్యా ఉదంతం బయటపడింది. కన్నకొడుకును ప్రియుడితో హత్యచేయించినట్లు ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. దుర్గతో పాటు ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హోటల్ గదిలో ‘డబుల్’ శృంగారం.. ముందు లవర్, తర్వాత భార్య! బాత్రూంలో ట్విస్ట్


Next Story

Most Viewed