మహిళలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అమల్లోకి పొదుపు పథకం

by Disha Web Desk 17 |
మహిళలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అమల్లోకి పొదుపు పథకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పొదుపు పథకం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి 2023-24 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పథకం 1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. ఇది ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో మహిళలకు 7.5 శాతం స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 2 లక్షలుగా ఉంది.

ఇవి కూడా చదవండి:

ఈ రోజు నుంచి కొత్త రూల్స్..

మహిళలు సాఫీగా మూత్ర విసర్జన చేయడానికి ఓ చట్టం ఉందని తెలుసా..?


Next Story