ఈ రోజు నుంచి కొత్త రూల్స్..

by Disha Web Desk 17 |
ఈ రోజు నుంచి కొత్త రూల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్:ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు ఆర్థిక విషయాల్లో మార్పులు వస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం కావడంతో ప్రభుత్వం తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు ఈ తేదీ నుంచే ఎక్కువగా అమలవుతాయి. అయితే ఈ రోజు ఏప్రిల్ 1. ఈ రోజు 2023-24 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో ఇప్పటి నుంచి ప్రజల జీవితాల్లో కొన్ని మార్పులు రానున్నాయి, మరి అవి ఏంటో ఒకసారి చూద్దాం..

* వ్యాపారులు తమ యూపీఐ లావాదేవీలపై 1.1 శాతం ఇంటరాపబుల్‌ చార్జీలు చెల్లించాలి.

* ఔషధాల ధరలు 12 శాతం వరకు పెరగనున్నాయి.

* ఇక మీదట సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు.

* ఈ రోజు నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయి.

* ఎక్స్‌ప్రెస్‌ వేలు, జాతీయ హైవేలపై టోల్‌ టాక్స్‌ 3.5% - 7% పెరగనుంది.

* ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అలవెన్స్ రూ.25 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అంతకుముందు ఇది కేవలం రూ.3 లక్షలు మాత్రమే.

* రూ.5 లక్షలకు పైబడి వార్షిక ప్రీమియం ఉన్న పాలసీలపై పన్ను విధించనున్నారు.

ఇవి కూడా చదవండి:

మహిళలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అమల్లోకి పొదుపు పథకం

రెండోసారి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు



Next Story

Most Viewed