ఆ డ్రగ్ మత్తులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు.. షకీలా సంచలన కామెంట్స్

by Disha Web Desk 6 |
ఆ డ్రగ్ మత్తులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు.. షకీలా సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-7 షోలో ప్రముఖ నటి షకీలా రెండో వారం ఇంటి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫైర్ బ్రాండ్ షకీలా అంటే మంచి కంటెంట్ ఉంటుందని అంచనాలు పెంచుకున్న ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన షకీలా నేరుగా బిగ్‌బాస్ బజ్‌లోకి వెళ్లి గతూ రాయల్‌తో ముచ్చటించింది. ఇందులో భాగంగా హౌస్‌మెట్స్‌పై షకీలా సంచలన కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కంటెస్టెంట్ల గురించి షకీలా మాట్లాడుతూ.. చిన్న సమస్య ఎదురైతే అమర్ దీప్ తట్టుకోలేకపోతున్నాడు. యావర్ పెద్ద ఎదవ.. బాడీ పెంచితే.. ఏదైనా సాధించవచ్చు అనే భ్రమలో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ బ్లడీ రాంగ్ యాటిట్యూడ్. ఇంట్లోకి వచ్చిన రోజు చెప్పులు బయట విడిచి వచ్చాడు. రెండో రోజు ఇంటి ముందు పెట్టాడు. మూడో రోజు ఇంట్లోకి చెప్పులు వేసుకుని వచ్చాడు. నాలుగో రోజు చెప్పులు కాళ్లకు వేసుకొని కాలిపై కాలు వేసుకొని ఆడించాడు. పాపులారిటి అనే డ్రగ్ మత్తులో ప్రశాంత్ ఉన్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆట సందీప్.. ఇంట్లో ఉండాల్సిన హుందాతో ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించింది. ఇక శివాజీ సొంత బ్రదర్ కంటే ఎక్కువ అని ప్రేమను కురిపించింది. అలాగే రతిక అందమైన విష సర్పం. ఎవరి కళ్లలోకి చూడదు. ఇతరులకు దొరికిపోతాననే భయం ఆమెకు ఉంది అని షకీలా కామెంట్ చేసింది. అంతుకాకుండా తాను చనిపోతే బిగ్‌బాస్ హౌస్‌మెట్స్ అందరై రావాలని నాకు అదే కావాలని చెప్తూ ఎమోషనల్ అయింది.

Read More..

బిగ్ బాస్ హౌస్‌లో సిగరెట్లు తాగిన మహిళా కంటెస్టెంట్.. ఒక్కరోజే ఎన్ని తాగిందంటే?



Next Story

Most Viewed