తిరిగి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఈటల : బండి సంజయ్

by  |
Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ​బైపోల్‌లో గెలుపు ఈటల రాజేందర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు రౌండ్లలోనూ బీజేపీ ముందంజలో ఉందని, ఎమ్మెల్యేగా ఈటల తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ఆయన అన్నారు. హుజురాబాద్‌లో ఏది ఏమైనా కాషాయ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈటల భారీ విజయం సాధించడం ఖాయమని ఆయన తెలిపారు. ఈటల గెలుపు బీజేపీ గెలుపని, బీజేపీ గెలుపు ఈటల గెలుపని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం లేదని, అది ఈ ఉప ఎన్నిక ద్వారా స్పష్టం కానుందని తెలిపారు. దళిత బంధు అమలు చేసినా ప్రజలు కేసీఆర్‌ను విశ్వసించలేదని పేర్కొన్నారు.

మా ఓటమికి కారణం ఆ గుర్తులే.. సాకులు వెతుక్కుంటోన్న పార్టీలు

Next Story