మా ఓటమికి కారణం ఆ గుర్తులే.. సాకులు వెతుక్కుంటోన్న పార్టీలు

by  |
BJP, TRS
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్కంఠగా కొనసాగుతోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 2958 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. నెక్ టు నెక్ సాగుతున్న కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ తక్కువ ఓట్లతో ఓడిపోతే చేయాల్సిన ప్రకటనలపై ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు. అయితే, ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు రొట్టెకోల గుర్తు మా కొంప ముంచిందని అనడానికి సిద్ధమై పలు న్యూస్ ఛానళ్లలో ఇంటర్వ్యూల్లో చెప్పేస్తున్నారు. ఇక మేమూ తక్కువ కాదంటున్నారు బీజేపీ పార్టీ నేతలు.

టీఆర్ఎస్ రొట్టెకోల గుర్తుపై విమర్శలకు దిగితే, బీజేపీ నేతలు డైమండ్ గుర్తుపై పడ్డారు. ఎందుకంటే డైమండ్ గుర్తుకు 110కి పైగా ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇలా పార్టీ నేతలు సాకులు వెతుక్కుంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed